భారతీయ సినిమా నటి కైరా అద్వానీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న కైరా తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ బిజీగా ఉంటోంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ.ఇక ఈమెకున్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.
2014లో ‘ఫగ్లీ‘ సినిమాతో హిందీలో తొలిసారిగా వెండితెరకు పరిచయము కాగా.ఈ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకుంది.అంతేకాకుండా 2016 లో ఎం.ఎస్ ధోని సినిమాలో నటించగా ఆ సినిమాలో తన నటనకు గుర్తింపు పొందింది.ఇక 2018 లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తో తెలుగులో తొలిసారి పరిచయం కాగా వసుమతి పాత్రలో బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా వినయ విధేయ రామ సినిమాలో కూడా బాగా నటించింది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేయగా.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.ప్రస్తుతం కైరా అద్వానీ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లో అందమైన లొకేషన్లలో ఎంజాయ్ చేస్తుంది.
మొత్తం మంచు తో కూడిన పర్వతాల మధ్య పైనుంచి మంచి కురుస్తూ కెమెరా వైపు చూస్తూ కన్నుగీటుతూ కనిపిస్తుంది.ఇది చూసిన నెటిజనులకు బాగా ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భూల్ భూలయ్యా 2 సినిమాల్లో నటిస్తుంది.ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలీ లో జరుగుతుంది.ఇందులో మొదటి భాగంను ప్రియదర్శన్ దర్శకత్వం చేసాడు.