కరోనా వైరస్ బాలీవుడ్ సెలబ్రెటీలని ఇంకా భయపెడుతూనే ఉంది.కేవలం ఓ విధంగా చెప్పాలంటే ఇండియన్ వైడ్ గా సెలబ్రెటీలు ఇప్పుడు షూటింగ్ లలో పాల్గొంటున్న ఎప్పుడు, ఎవరికీ, ఎలా కరోనా వస్తుందో అనే టెన్షన్ పడుతున్నారు.
టాలీవుడ్ లో కొద్ది రోజుల క్రితం మెగా హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు.ప్రస్తుతం ఇద్దరు క్వారంటైన్ లో ఉన్నారు.
బాలీవుడ్ లో కూడా కృతి సనన్, ఓ డైరెక్టర్ కరోనా బారిన పడ్డారు.ఇప్పుడు బాలీవుడ్ లో మరో దర్శకులు కరోనా బారిన పడినట్లు స్వయంగా ప్రకటించారు.
స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అని తెలియజేశారు..
తనకు ఎలాంటి లక్షణాలూ లేవని అయినా కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారుల సూచన మేరకు క్వారెంటైన్ లో ఉన్నానని చెప్పారు.ఆయన ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ లీడ్ కాంబినేషన్ లో అత్రంగి రే అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.తనకి కరోనా వచ్చిందని నిర్ధారించిన ఆనంద్ ఎల్ రాయ్ తనతో టచ్లో ఉన్నవారందరూ దయచేసి కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారెంటైన్లో ఉండాలని కోరారు.
మొత్తానికి ఆనంద్ ఎల్ రాయ్ ద్వారా ఎంత మంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడే అవకాశం ఉందనేది త్వరలో తెలుస్తుంది.బాలీవుడ్ లో అందరికంటే ముందుగా బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారిన పడ్డారు.
తరువాత చాలా మంది కరోనా బారిన పడి కోలుకుంటున్నారు.కొంత మంది సెలబ్రెటీ ప్రముఖులు కరోనాతో చనిపోయారు.
.