సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, కొన్నేళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత బ్రేకప్ చెప్పడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.ఈ మధ్య కాలంలో అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి.
అందుకు ఉదాహరణగా ఇటీవలే టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత ఇద్దరూ విడాకులు తీసుకోని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ వారి ప్రేమ బంధానికి బ్రేక్ అప్ చెబుతూ విడిపోయిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరొక జంట నాగచైతన్య సమంత ల బాటలో పయనిస్తూ వారి బంధానికి బ్రేక్ అప్ చెప్పినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ స్టార్ జంట అయిన అర్జున్ కపూర్, మలైకా అరోరా వారి బంధానికి బ్రేక్ అప్ చెప్పినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే వీరు దూరం దూరంగా ఉంటున్నారని, ఒకరిని మరొకరు కలవడం లేదని తెలుస్తోంది.అర్జున్ కపూర్, మలైకా అరోరా వారి నాలుగేళ్ల రిలేషన్ షిప్కు గుడ్ బై చెప్పారు.
అందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.అదే విషయాన్ని వారు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించనున్నారు.
ఇక 3 రోజుల క్రితం అర్జున్ కపూర్ తన సోదరి రియా కపూర్ ఇంటికి డిన్నర్కు వెళ్ళి పక్కనే మలైకా ఇల్లు ఉన్నా అక్కడికి వెళ్లకుండా డిన్నర్ ముగియగానే తన నివాసానికి వెళ్లిపోయినట్లు బాలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి.సాధారణంగా రియా కపూర్ ఇంట్లో జరిగే డిన్నర్ మీటింగ్లకు మలైకా అరోరా, అర్జున్ కపూర్ కలిసి వెళ్తుంటారు.కానీ కొన్ని రోజులుగా ఈ జంట అక్కడ కనిపించడం లేదు.అర్జున్ ఒక్కడే వెళ్తున్నాడు.వీరిద్దరు వీడిపోతున్నారు అంటూ గత కొద్ధి రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది.కానీ ఇటీవల అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట మాల్దీవుల్లో సందడి చేసి వారి బంధం పై బ్రేకప్ పుకార్లకు చెక్ పెట్టారు.
కానీ ఆ టూర్ తర్వాత వీరిద్దరు విడి విడిగా ఉంటున్నారని తెలిసింది.