ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాన్య ప్రజలకి బాగానే అవగాహన కల్పిస్తున్నారు.అయితే ఇంకొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి తమకు తోచినంత సహాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాల రూపంలో నగదు మొత్తాన్ని అందిస్తున్నాయి.
అయితే తాజాగా బాలీవుడ్ కి చెందినటువంటి నటుడు చేసినటువంటి పనికి నెటిజన్లు దారుణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇంతకీ ఆ ప్రముఖ సెలబ్రెటీ ఎవరు అతను ఏం చేశాడో ఒకసారి తెలుసుకుందాం…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సుస్మితాసేన్ గురించి తెలియని వారుండరు.
అయితే ఆమె సోదరుడు రాజీవ్ సేన్ గురించి కూడా అడపాదడపా కొంతమందికి బాగానే గుర్తు ఉంటారు.అయితే అతడు సెలబ్రిటీ కాకపోయినప్పటికీ తన సోదరి పేరుతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.
అయితే తాజాగా రాజీవ్ సేన్ తన భార్యతో దిగినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అయితే ఇందులో రాజీవ్ సేన్ మరియు ఆయన భార్య ఇద్దరు సరసాలాడుతున్న సమయంలో తీసుకున్నటువంటి ఫోటోలు కావడంతో నెటిజన్లు ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సరికాదంటున్నారు.
అంతే గాక ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని మరియు అంతేగాక మనుషుల మధ్య సామాజిక దూరం పాటించాలని చెప్పినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరైతే మాత్రం సరసాలకి ఇది సమయం కాదని కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజీవ్ సేన్ కి అంటూ సూచిస్తున్నారు.