టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకన్నా చాలా అభివృద్ధి చెందింది.ఇంతకు ముందు బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ పై చిన్న చూపు చూసేవారు.
కానీ బాహుబలి అంత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ద్రుష్టి అంతా టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడడంతో ఇప్పుడు హీరోయిన్స్ తెలుగు వైపుకు అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
కొంతమంది సక్సెస్ కూడా అయ్యారు.మరి కొంతమంది ఇప్పుడిప్పుడే సక్సెస్ అవ్వడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.మొత్తానికి బాలీవుడ్ బ్యూటీ లు కూడా తెలుగు ఇండస్ట్రీ ను గుర్తించడమే కాకుండా తెలుగులో నటించడానికి కూడా సిద్ధం అవుతున్నారు.టాలీవుడ్ ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కుతున్నాయి.
అందుకే బాలీవుడ్ ముద్దుగుమ్మలు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.తమ గ్లామర్ తో, నటనతో అభిమానులను సంపాదించు కుంటున్నారు.
మరి అలాంటివారి లిస్టులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఒకరు.ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ లో చాలా అవకాశాలు వరిస్తున్నాయి.అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మేజర్.ఈ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా బాగుంటుందని నటనకు స్కోప్ ఎక్కువుగా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాతో పాటు సయీ మంజ్రేకర్ వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ సినిమాలు విడుదల అవ్వకుండానే ఈ అమ్మడు చాలా పాపులర్ అయ్యింది.
ఈ సినిమాలు సక్సెస్ అయితే ఈ అమ్మడికి ఇంకా టాలీవుడ్ లో తిరుగే లేదని చెప్పాలి.