తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఏక్ నిరంజన్” అనే చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మరియు రింగు రింగుల జుట్టు భామ కంగనా రనౌత్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు అయితే ఈ ఏక్ నిరంజన్ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పాలైనప్పటికీ కంగనా రనౌత్ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.అంతేగాక ఈ అమ్మడికి బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు అవకాశాలను కూడా తెచ్చిపెట్టాయి.
దీంతో ఇక కంగనా రనౌత్ మళ్లీ అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ వైపు చూడలేదు.
అయితే తాజాగా కంగనా రనౌత్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవలే రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి కంగనా రనౌత్ చిన్నప్పటి ఫోటో ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.అలాగే తన సోదరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపింది.
దీంతో కొందరు నెటిజన్లు కంగనా రనౌత్ తన చిన్నప్పటి ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు. అంతేగాక కంగనా రనౌత్ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా లక్షలకి పైగా లైకులు వచ్చాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కంగనా రనౌత్ “తలైవి” అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రం తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోంది.కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం.