టాలీవుడ్ యంగ్ రెబల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల ను మించి దూసుకుపోతున్నారు.ఇక వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు.
ఇకపై పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ఆసక్తి చూపుతున్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనుంది.ఈ సినిమా రామాయణం నేపథ్యంతో రూపొందుతుంది.ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.బాలీవుడ్ నటులు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర, సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈమె సీత పాత్రలో కనిపించనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తుంది.కానీ ఈ విషయం గురించి సినీ బృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇంతకీ ఈ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తుందో లేదో తెలియదు కానీ.
మొత్తానికి బాలీవుడ్ నటులు ప్రభాస్ సినిమాలపై బాగా ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఈ సినిమాకు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు.
ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, మరో స్టార్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.