సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట.మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది.ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో మహేష్ బాబుకి ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు.
ఇక బ్యాంకుల సొమ్ముని దోచేసి విదేశాలు పారిపోయిన కార్పోరేట్ కేటుగాళ్ళని ఇండియాకి రప్పించే హీరో పాత్రలో మహేష్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు.ఇక ఎన్నడూ లేని విధంగా పక్కా మాస్ పాత్రలో ఈ మూవీ కోసం మహేష్ కనిపించనున్నాడని తెలుస్తుంది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అందరూ భావించారు.అయితే పరశురాం మాత్రం అలాంటిదేం ప్లాన్ చేయలేదు.
కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు పరశురాం షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.
అవకాశం ఉంటే అమెరికా వెళ్లి తెరకెక్కించాలని లేదంటే ఇక్కడే సెట్స్ వేసి షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా తమన్ ఈ సినిమా సాంగ్స్ కి సంబంధించి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.
సర్కారువారి పాట మూవీలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని వాటిలో రెండు సాంగ్స్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయని చెప్పారు.అలాగే మిగిలిన మూడు సాంగ్స్ లో ఒకటి ఐటెం సాంగ్ అని క్లారిటీ ఇచ్చాడు.
అది ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని చెప్పాడు.ఇక ఈ ఐటెమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ కనిపించే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.
ఊర్వశీని ఈ సాంగ్ కోసం సంప్రదిస్తున్నట్లు బోగట్టా.ఆమె ఒప్పుకోకున్న కచ్చితం బాలీవుడ్ హాట్ బాంబ్స్ ని మాత్రం సాంగ్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని టాక్.