ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ కి భారత్ లో ఎంతో క్రెజ్ ఉంది.మన తెలుగు బుల్లితెరపై కూడా బిగ్ బాస్ షో మొదలయితే చాలు ప్రేక్షకులకు పండగే.
హీరో హీరోయిన్స్ దగ్గర నుండి సోషల్ మీడియా స్టార్స్ వరకు ఈ షో ద్వారా తమ టాలెంట్ ఏంటో నిరుపించుకున్నారు.ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలు సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా బిగ్ బాస్ 15 ఓటిటీలోకి తనకు అవకాశం ఇవ్వాలని నడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేసింది.రాఖీ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు కూడా వార్తలలో నిలుస్తుంటుంది. తెలుగులో 6 టీన్స్‘ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో ఆడి పాడింది.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్నాళ్ల పాటు రాఖీ వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చింది.కానీ మళ్ళీ ఇప్పుడు స్పైడర్ ఉమెన్ రూపంలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మంగళవారం రోజున ముంబై వీధుల్లో తిరుగుతూ ఏకంగా స్పైడర్ మాన్ డ్రెస్ వేసి ఒక చేత్తో స్పైడర్ బొమ్మ ఉన్న సూట్ కేస్ పట్టుకుని మరో చేత్తో ఒక పెద్ద స్పీకర్ బాక్స్ పట్టుకుని పాటలు ప్లే చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చి వయ్యారాలు పోతూ డాన్సులు చేసింది.ఉమెన్ స్పైడర్ మ్యాన్ గా మారి రోడ్డుపై డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అసలు ఇలా అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటంటే తనను బిగ్ బాస్ 15 ఓటీటీ లోకి తీసుకోవాలనట.
రోడ్డు మీద డాన్స్ వేయడంతో పాటు తాను ఒక స్పైడర్ – ఉమెన్ అని చెప్పుకుంటూ బిగ్ బాస్ షో లో గల తన ప్రత్యర్థులను మట్టు పెట్టి విన్నర్ గా నిలుస్తానని చెప్పుకొచ్చింది.ప్రస్తుతానికి ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు సంబందించి వోట్ జరుగుతుండగా రాఖీ ఇలా ఉమెన్ స్పైడర్ మాన్ రూపంలో హల్ చల్ చేయడం కాస్త ఆలోచించాలిసిన విషయమే.ఇదిలా ఉండగా ఇంతకముందు కూడా ఇదే రీతిలో తనను ఇంకా బిగ్ బాస్ ఓటీటీ షో కి పిలవలేదని విచారం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది.
అలాగే తనకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.సిద్ధార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్ లాంటి వారిని బిగ్ బాస్ షో కి ఆహ్వానించిన వారు తనని మాత్రం ఎందుకు ఇప్పటిదాకా ఆహ్వానించలేదని చెప్పుకొచ్చింది.