ఒకప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెద్ద ఇండస్ట్రీ అంటే అందరూ బాలీవుడ్ అని చెప్పేవారు.కేవలం ఇలా చెప్పుకోవడం మాత్రమే కాదు అక్కడ సినిమాల విజయాలు కూడా అదే రేంజ్ లో ఉండేవి.
ఒకప్పుడు టాలీవుడ్లో వంద కోట్ల వసూళ్లు అనే మాట వినిపించక ముందే అటు టాలీవుడ్లో మాత్రం 100 కోట్లు వసూళ్లు సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.దీంతో ఇక సినిమా పరిశ్రమలో బాలీవుడ్ దే పెద్ద పాత్ర అని అనుకునే వారు.
కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం మారిపోయాయి.బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అటు టాలీవుడ్ హీరోల సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు.
అదే సమయంలో అటు బాలీవుడ్ హీరోల సినిమాలను మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ పరిధి అంతకంతకు పెరిగి పోతూనే ఉంది.
ఇక ప్రస్తుతం అందరు హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తూ ఉండడంతో ఇక టాలీవుడ్ హీరోలు అంతకుమించి అనేక విజయాలు సాధిస్తున్నాయి.ఇలా అటు బాలీవుడ్ మరోవైపు టాలీవుడ్ సినిమాల మధ్య వార్ మాత్రం చాలా గట్టిగానే జరుగుతుంది అని తెలుస్తోంది.
ఇప్పటికీ సౌత్ నుంచి హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమా విడుదల ఉండగా ఇక హీరో యష్ నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.ఇక బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.
బీస్ట్ హవా సౌత్ కే పరిమితమైన.కే జి ఎఫ్ చాప్టర్ 2 పై మాత్రం బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక అదే సమయంలో షాహిద్కపూర్ జెర్సీ పై కూడా అంచనాలు ఉన్నాయి.అయితే కె.
జి.ఎఫ్ తుఫాను ముందు మాత్రం జెర్సీ నిలవగల లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.
దీంతో ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 22 కి వాయిదా వేసుకున్నాడు షాహిద్ కపూర్. ఇలా ఒక సౌత్ హీరో సినిమా గురించి బాలీవుడ్ స్టార్ హీరో తమ సినిమాని వాయిదా వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.ఇలా సౌత్ ప్రభంజనం ముందు బాలీవుడ్ బ్యాక్ స్టెప్పు వేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.