బాలీవుడ్ లో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నటువంటి “రాదే’ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్న హీరో అర్జున్ కనుంగో తండ్రి ఇటీవలే కన్నుమూశాడు.గత కొద్దికాలంగా అర్జున్ తండ్రి గుర్తుతెలియని క్యాన్సర్ వ్యాధితో భాధ పడుతున్నాడు.
ఇందులో భాగంగా ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు.కానీ వయసు మీద పడడంతో క్యాన్సర్ ను జయించలేక ఇటీవల మృతి చెందాడు.
ఈ విషయాన్ని అర్జున్ కనుంగో తాజాగా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.అంతేగాక “మనం మళ్లీ కలుసుకునేంతవరకూ ప్రశాంతంగా ఉండండి నాన్నా” అంటూ ఎమోషనల్ అయ్యాడు.
దీంతో నెటిజన్లు అర్జున్ తండ్రి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.అయితే బాలీవుడ్ లో దాదాపుగా రెండు రోజుల వ్యవధిలోనే మూడు మరణాలు సంభవించాయి.
దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.ఇటీవలే భారత దేశ చలన చిత్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేసినటువంటి స్టార్ హీరో మరియు లెజండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ గుర్తుతెలియని క్యాన్సర్ తో ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే.
అలాగే బాలీవుడ్ లో ఎన్నో చిట్టా చిత్రాల్లో నటించినటువంటి సీనియర్ హీరో రిషి కపూర్ కూడా మరణించిన కొన్ని గంటల్లోనే అనారోగ్య పరిస్థితుల కారణంగా అనుకోకుండా మరణించారు.
అర్జున్ కనుంగో మొదట్లో సినిమా పరిశ్రమలో సింగర్ గా పనిచేశాడు.
తర్వాత నటనపై ఆసక్తి పెరగడంతో న్యూయార్క్ లో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో నటనకు సంబంధించిన మెరుగులు దిద్దుకున్నాడు.దీంతో తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ తన చిత్రాన్ని చూడకుండానే తన తండ్రి మరణించడంతో తనని తీవ్రంగా కలచివేసింది అంటూ అర్జున్ బాధ పడుతున్నాడు.