టాలీవుడ్
లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ
ఆర్ఆర్ఆర్
సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి
డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
కలిసి నటిస్తుండటం,
బాలీవుడ్ నటుడు అజయ దేవ్గన్
ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి.
కాగా ప్రస్తుతం
కరోనా వైరస్
మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది.అయితే బాలీవుడ్ నటుడు
అజయ్ దేవ్గన్
కుటుంబ సభ్యులకు కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
అజయ్ దేవ్గన్ – కాజోల్ల కూతురు నిశా
సింగపూర్లో చదువుకుంటోంది.కరోనా కారణంగా కాజలో తన కూతురును స్వయంగా వెళ్లి ముంబైకి తీసుకొచ్చింది.దీంతో వారి కుటుంబానికి
కరోనా వైరస్
సోకందనే వార్తలు వినిపించాయి.
అయితే తమ కుటుంబ సభ్యులకు కరోనా సోకలేదని, తమ కుటుంబం సేఫ్గా ఉందని తాజాగా
అజయ్ దేవ్గన్
అన్నారు.కాగా
కాజోల్, నిశా
ఇద్దరు వైద్యుల సూచన మేరకు
ఐసోలేషన్
లో ఉన్నట్లు అజయ్ దేవ్గన్ తెలిపాడు.