బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలు సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? ప్రస్తుతం అనసూయ బాలీవుడ్ ప్రాజెక్టుపై పని చేస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇలా అనసూయ బాలీవుడ్ ఎంట్రీ గురించి అనుమానాలు రావడానికి గల కారణం తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఈ విధమైనటువంటి అనుమానాలకు కారణం అవుతోంది.ప్రస్తుతం అనసూయ చేస్తున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేయగా అది సినిమాకు సంబంధించినదా లేదా సీరియల్ కి సంబంధించిన అనే విషయం తెలియలేదు కానీ… తన లుక్స్ మాత్రం బాలీవుడ్ వాళ్ళు కాపీ కొడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు
గౌరీ నాయుడు (అనసూయ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్) మరో స్నేహితురాల్ని చూడండి మిస్ సి! మేమిద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్టుల్లో ఆమెది ఒక పాత్ర అని చెప్పగలను తప్ప అంతకు మించి.ఇంకేమీ చెప్పలేను ఈ లుక్ కాపీ చేయడం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు.మా సెట్ నుంచి బాలీవుడ్ కి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారంటూ అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ప్రస్తుతం యాంకరమ్మ వివిధ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.