ప్రస్తుత కాలంలో ఎంతోమంది నటీనటులు ఎంతో మంది చిన్నారులను దత్తత తీసుకుని వారికి తల్లిదండ్రులగా మారి వారి బాధ్యతలను తీసుకుంటున్నారు.ఇలా ఎంతో మంది అనాధ పిల్లలకు తల్లిదండ్రులగా మారుతూ వారి పూర్తి బాధ్యతలను వీరే నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోగా తాజాగా బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ స్వర్ణ భాస్కర్ కూడా ఈ జాబితాలోకి చేరింది.ఈ క్రమంలోనే ఆమె తల్లిగా మారి తల్లి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హీరోయిన్ స్వర భాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తానెప్పుడు పిల్లలు కుటుంబాన్ని కోరుకుంటానని తెలిపిన ఈమె ఇండియాలో సింగిల్ ఉమెన్ లీగల్ గా దత్తత తీసుకొని వారిని పెంచుకోవచ్చనే అవకాశాన్ని కల్పించడం నిజంగా తన అదృష్టమని భావిస్తున్నట్లు తెలిపారు.
సాధారణంగా సింగిల్ గా కాకుండా దంపతులకు మాత్రమే బిడ్డను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇండియాలో మాత్రం ఈ విధమైనటువంటి వెసులుబాటు ఉండటం నిజంగా నా అదృష్టం అని తెలిపారు.
ఈక్రమంలోనే తనకి కూడా ఒక బేబీని దత్తత తీసుకోవడానికి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో అప్లై చేసుకున్నానని, ఈ క్రమంలోనే తాను కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు తెలిపారు.
తను తీసుకున్న ఈ నిర్ణయానికి తన పేరెంట్స్ కూడా మద్దతు తెలపడంతో ప్రస్తుతం ఈమె కూడా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అధారిటీలో కాబోయే పేరెంట్ గా ఉండబోతుందని ఈ అద్భుతమైన అవకాశం కోసం నిరీక్షించడం తన వల్ల కావడం లేదని ఇలా పిల్లలను దత్తత తీసుకోవడం కోసం మూడు సంవత్సరాల పాటు ఎదురు చూడాలని తెలిపారు.అయితే ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత జీవితాంతం పిల్లలకు తల్లిదండ్రులు గా ఉండే అవకాశం దక్కుతుంది అంటే మూడు సంవత్సరాలు ఎదురు చూడటం తక్కువేనని ఈ సందర్భంగా నటి స్వర భాస్కర్ వెల్లడించారు.