ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు చాలా వరకు తమ వ్యక్తిగత విషయంలో పొరపాట్లు చేస్తుంటారు.ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు.
ఇలాంటి విషయాల్లోనే సెలబ్రెటీలు ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.ఇప్పటికే చాలామంది సెలబ్రేటిలు తమ వ్యక్తిగత విషయాలలో బాగా వార్తల్లోక్కెక్కారు.
అలా నటి సుష్మితా సేన్ కూడా వ్యక్తిగత విషయం లో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ గురించి అందరికీ పరిచయమే.
ఈమె తన అందంతో విశ్వసుందరిగా పేరు సంపాదించుకుంది.కేవలం హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు సినిమాలలో కూడా నటించింది.
ఇక తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సుష్మితా సేన్ తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి 1996లో దస్తక్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకువెళ్ళింది.ఇక 20l5 లో నిర్భాక్ అనే సినిమాలో చివరిసారిగా నటించగా.ఆ మధ్య పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే గతంలో ఈమె ప్రముఖ మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే.నిజానికి అతడు సుష్మితా సేన్ కంటే చిన్నవాడు.అయినా కూడా వీరిద్దరూ ప్రేమలో పడటం తో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచారు.
ఇక గతంలో వీరిద్దరూ కలిసి బాగా తిరిగారు.చాలా సార్లు మీడియా కంటికి కూడా చిక్కారు.
అయినా కూడా వీళ్ళు ఎవర్నీ పట్టించుకోకుండా బాగా తిరిగారు. గతంలో రోహ్మన్ కూడా చాలాసార్లు సుష్మిత గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.
ఏదైనా ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తన గురించి ఖచ్చితంగా మాట్లాడేవాడు.తమకు పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురైనప్పుడు ఏ రోజు కూడా పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇవ్వలేదు.
కానీ కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కూడా.
ఇక సుష్మిత సేన్ ఇద్దరి పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా తాను ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్ కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టింది.అదృష్టవశాత్తు తను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నానని.తను ఎప్పుడు పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమని తెలిపింది.
ఈ విషయంలో తన పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు అని.వారితో ఎప్పుడూ తనకు మంచి సాన్నిహిత్యమే ఉందని తెలిపింది.ఇక తన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించారు అంటూ.ప్రతి ఒక్కరికి సమానమైన ప్రేమ, గౌరవనీ ఇచ్చారు అని.ఇది చాలా సంతోషకరమైన విజయం అని తెలిపింది.
ఇక తాను సుమారు మూడుసార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది అని.మూడుసార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను అని.కానీ ఆ దేవుడు తనను రక్షించాడు అంటూ.వారి జీవితంలో జరిగిన విషయాలు తను చెప్పలేను అని తెలిపింది.దేవుడు తనను, తన పిల్లలను కాపాడుతున్నాడు అని.అతను ఎలాంటి చెడు బంధంలోకి వెళ్ళనివ్వడు అని తెలిపింది.