పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్గా మారిన సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమెకు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సినిమాలలో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ ఉంది.అంటే అందుకోసమే వెళ్లే వారు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక ఈ బ్యూటీ కి ఇంస్టాగ్రామ్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సన్నీ లియోన్ అంటే కుర్రకారుకి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మొదట జిస్మ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమె డేనియల్ వెబర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు సరోగసీ ద్వారా నోవా, అషెర్ అనే కవల పిల్లలు జన్మించారు.
అంతే కాకుండా ఈ దంపతులు నిషా అనే బాలికను కూడా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా సన్నీ లియోన్ ఒక ఇంటర్వ్యూలో సరోగసీ ద్వారా పిల్లలను పొందడం గురించి మాట్లాడింది.
దాదాపుగా సంవత్సరన్నర పట్టిన ఆ ప్రాసెస్ సమయంలో తన గుండె బద్దలై పోయింది అని ఆమె చెప్పుకొచ్చింది.అయితే ఆ పిల్లలు కలవడానికి ముందు ఎవరైనా పిల్లల్ని ఎందుకు దత్తత తీసుకోకూడదు అని ఆలోచించినట్లు కూడా ఆమె తెలిపింది.
మేము సరోగసీ ప్రక్రియకు వెళదామని తీసుకుని ముందుకు వెళ్లాం.ఈ ప్రక్రియ దాదాపుగా ఏడాదిన్నర సమయం పట్టింది.ఇక ఆ సమయంలో సరోగసీ సరైన విధంగా సాగకపోవడంతో అదే మనం ఎందుకు దత్త తీసుకోకూడదు అన్న విషయాన్ని ఆలోచించాం.మాకు 6 అందాలు కాగా అందులో నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కావాలి.
అమెరికాలో లింగ నిర్ధారణ పరీక్షలు, జన్యు పరీక్షలు చేయించవచ్చు అని చెప్పుకొచ్చింది.
అయితే ఇక్కడ అలా కాదు.కాబట్టి మేము ఐవిఎఫ్ చేసాం.కానీ మేము అనుకున్నట్లు అమ్మాయిలు పుట్టలేదు.
దీంతో నిజంగా గుండె పగిలే అంత బాధ కలిగింది అంటూ సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.అదే విధంగా అలా ఎవరైనా ఉంటే వైఫల్యం చెందినట్లు భావిస్తారు.
చాలా వీక్ గా ఫీల్ అవుతారు.నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అని ఆమె తెలిపింది.