బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తోంది.అందుకు గల కారణం ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఫోటోగ్రఫీ కేసులో అరెస్టు కావడంతో గత కొద్దిరోజుల నుంచి వీరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను వీడియోలుగా చిత్రీకరించి వాటిని యాప్స్ లో అప్లోడ్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారన్న ఆరోపణలతో అతనిని ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అప్పటి నుంచి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే శిల్పాశెట్టికి కూడా ఈ కేసులో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆమెను విచారించారు.అయితే శిల్పాశెట్టి తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉండటం వల్ల తన భర్త ఏం చేస్తున్నాడో.
తనకు తెలియదని ఎప్పుడూ కూడా తన చేస్తున్న పనులు ఏంటి అని తన అడగలేదని చెప్పడంతో పోలీసులు ఈ విషయాన్ని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు.అదేవిధంగా హాట్షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి తనకు తెలియదని శిల్పాశెట్టి చెప్పడంతో ఆ విషయాలను కూడా ముంబై పోలీసులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
ఇలా తన భర్త కేసులో భాగంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న శిల్పాశెట్టి తాజాగా దైవ దర్శనం కోసం జమ్ముకశ్మీర్కు వెళ్ళినట్లు తెలుస్తుంది.
శిల్పా శెట్టి తన స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి గుర్రంపై స్వారీ చేస్తూ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది.వైష్ణోదేవి ఆలయానికి చేరుకున్న శిల్పాశెట్టి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆ పూజలో పాల్గొన్నారు.ఈ దైవ దర్శనానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భర్త కోసమే అమ్మవారి దర్శనానికి వెళ్లిన అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అమ్మవారి పిలుపు ఆశీస్సుల మేరకే ఇక్కడికి వచ్చానని ఈ సందర్భంగా శిల్పా శెట్టి పేర్కొన్నారు.