ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమలో మహిళల లైంగిక వేధింపుల గురించి మీటూ ఉద్యమం ద్వారా అందరికీ అవగాహన పెరగడంతో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొంటున్న సంఘటనల గురించి ప్రజలకి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తెలుగులో టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “ఊసరవెల్లి” అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న “బాలీవుడ్ నటి పాయల్ ఘోష్” ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని ఓ సినిమా అవకాశం విషయమై కలవడానికి వెళ్లగా అతడు తనకి నీలి చిత్రాలు చూపించి తనని లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని తీవ్ర ఆరోపణలు చేసింది.
అంతే గాక అతడి నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వారు అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకోవడం లేదని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఎమోషనల్ అయ్యింది. అంతేగాక ఈ మధ్యకాలంలో తానంటే గిట్టని కొందరు బాలీవుడ్ మాఫియాతో చేతులు కలిపారని తొందర్లోనే తనను హత్య చేయడానికి పన్నాగం కూడా పన్నుతున్నట్లు తెలిపింది.
తన మరణం బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెద్ద మిస్టరీ గా మిగిలిపోతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఇప్పటికైనా తన ఫిర్యాదుపై స్పందించిన ఆ ప్రముఖ దర్శకుడి పై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసింది.
దీంతో కొంత మంది బాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ కి తమ మద్దతును తెలియజేశారు.అలాగే పాయల్ ఘోష్ కి సోషల్ మీడియా మాధ్యమాలలో నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్లో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “కోయి జానే నా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.