ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకపక్క డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు కలకలం సృష్టిస్తుంటే కొత్తగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ప్రకంపనలు రేపుతోంది.అయితే ఇటీవలే తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన “ప్రయాణం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్” సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల విషయం గురించి బయట పెడుతూ పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో భాగం గంగా ఓరోజు తాను సినిమా అవకాశం విషయమై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని కలిసేందుకు వెళ్లగా అతడు తనని పర్సనల్ గదిలోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని, అంతేగాక తన చిత్రాల్లో అవకాశాల కోసం వచ్చే వారు కూడా తనకి కమిట్మెంట్లు ఇస్తారని, కాబట్టి సినిమా అవకాశం కావాలంటే నువ్వు కూడా ఇలాగే చేయాల్సిందేనంటూ బలవంత పెట్టబోయాడని అంటూ సంచల వ్యాఖ్యలు చేసింది.కానీ తాను ఆ సందర్భంలో చాకచక్యంగా తప్పించుకుని బయటపడ్డానని ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపింది.
దీంతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ చేసినటువంటి ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి బాలీవుడ్ సినీ పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతును తెలియజేస్తున్నారు.
అంతేకాక ఈ మధ్య కాలంలో కొందరు సినీ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైన ఎలాగైనా పాపులర్ కావాలని ఇలా దర్శక నిర్మాతలపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నారని ఇది సరికాదని అంటున్నారు.ఇందులో భాగంగా ఇటీవలే బాలీవుడ్ సెలబ్రెటీ మందాన కరిమి తన మద్దతుని దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి తెలిపింది.
ఈ క్రమంలో తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయినప్పుడు సినిమా పరిశ్రమను వదిలిపెట్టి వెళ్లిపోవాలని కూడా అనుకున్నానని అలాంటి సమయంలో అనురాగ్ కశ్యప్ తనకి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని, తనని ఎంతగానో ప్రోత్సహించారని అలాంటి వ్యక్తి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.