తెలుగులో యంగ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించిన “సాహో” చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రం భారీ బడ్జెట్ తరహాలో ఉండటంతో దర్శకుడు సుజిత్ కొంతమేర ఎక్కువగా బాలీవుడ్ నటీనటులు నటింపజేసాడు.
కాగా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటి “మందిర బేడీ” ప్రేక్షకులని బాగానే అలరించింది.అయితే ఈ మధ్యకాలంలో మందిర బేడీ సోషల్ మీడియాలో మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
అంతేగాక అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అందమైన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేసింది. దీంతో కొందరు నెటిజన్లు 48 ఏళ్ల వయసులో ఘాటు అందాల ఆరబోతతో మందిర మతి పోగొడుతుందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే మందిర బేడీ అప్పుడప్పుడు యోగ మరియు జిమ్ వర్కౌట్లు చేస్తూ ఆరోగ్యానికి సంబందించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.కాగా ప్రస్తుతం మందిర బేడీ ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 13 లక్షల పై చిలుకు మంది అనుసరిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మందిర బేడీ తమిళ భాషలో “అంగారథన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే సోషల్ మీడియా మాధ్యమాలలో పలు సంస్థల వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.
కాగా ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.