బాలీవుడ్ బ్యూటీ, నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి మనందరికి సుపరిచితమే.ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు అయితే తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలుగజేసుకుని ఆ విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఆమె సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది.
అలాగే సమాజంలో జరిగే పలు విషయాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె జనవరి 12న స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చింది.ప్రపంచానికి సహనం, సార్వత్రిక ఆమోదం రెండింటినీ బోధించిన మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను.
మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడం మాత్రమే కాకుండా.మేము అన్ని మతాలను సత్యం అంగీకరిస్తాను అంటూ కంగనా రనౌత్ రాసుకొచ్చింది.
అదేవిధంగా స్వామి వివేకానంద కి కంగనా రనౌత్ నివాళులు అర్పించడం అనేది ఇదేమీ మొదటిసారి కాదు.గత ఏడాది కూడా స్వామి వివేకానందని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.అందులో నన్ను నేను పోగొట్టుకున్నప్పుడు మీరు నన్ను కనుగొన్నారు.ఇక్కడ ఉండేలా నా చెయ్యి పట్టుకున్నారు.ఏ ఆశ లేదని నేను భ్రమ పడినప్పుడు నాకు ఒక పర్పస్ ఉంది అని గుర్తు చేశారు.నా గురువుగా మిమ్మల్ని మించిన దేవుడు లేరు.
నా జీవితం మొత్తం నీకు అంకితం అంటూ రాసు కొచ్చింది కంగనా రనౌత్.ఇదిలా ఉంటే కంగనా రనౌత్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.