తల్లిని తలుచుకొని ఎమోషనల్ అవుతున్న జాన్వీ కపూర్...

గత ఏడాది సరిగ్గా ఇదే రోజున విలక్షణ నటి మరియు అందాల తార శ్రీదేవి మరణించింది.దీంతో ఒక్కసారిగా ఆమె మరణవార్త విన్నటువంటి సినీ అభిమానులు మరియు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

 Bollywood Actress Jhanvi Kapoor Getting Emotional To Share Her Mother Photo-TeluguStop.com

అంతేకాక ఎంతోమందికి అభిమాన తార గా ఉన్నటువంటి శ్రీదేవి మరణవార్త పలువురిని కలచి వేసింది.దాదాపుగా టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్, ఇలా చిత్ర పరిశ్రమతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది నటి స్వర్గీయ శ్రీ దేవి.

అయితే ఈ రోజు శ్రీదేవి మొదటి వర్ధంతి కావడంతో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ చిన్నప్పుడు తన తల్లితో దిగినటువంటి ఫోటో ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు.అంతేగాక ఈ ఫోటోకి రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అని క్యాప్షన్ పెట్టింది.

దీంతో ఈ ఫోటోకి పలువురు శ్రీదేవి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక ఏ లోకంలో శ్రీదేవి ఉన్నప్పటికీ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

అలాగే జాన్వీ కపూర్ కి కూడా తన తల్లి లాగే పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవాలని అంతేగాక నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు గా శ్రీదేవి పేరు నిలబెట్టాలని సూచిస్తున్నారు.

Telugu Bollywood, Jhanvi Kapoor, Jhanvikapoor, Sridevi Day, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాన్వీ కపూర్ దోస్తానా అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు.

అలాగే మరో రెండో చిత్రాల్లో కూడా నటిస్తోంది ఈ అమ్మడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube