అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ధడక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు నటి జాన్వీ కపూర్.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా మిలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి జాన్వీ కపూర్ తాజాగా హైదరాబాద్లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన ఈమె పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.
మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే ఏంటి అని అడగగా…మనకు ఏ దుస్తులైతే సౌకర్యవంతంగా ఉంటాయో అవి ధరించడమే నా దృష్టిలో ఫ్యాషన్ అంటూ సమాధానం చెప్పారు.
ఇక మిలి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా నేను అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోయినా ప్రేక్షకుల నుంచి నాకు ఎంతో ప్రేమాభిమానాలు దక్కాయని తెలియజేశారు.ఇకపోతే గత కొన్ని రోజులుగా నుంచి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెట్టబోతున్నారు అంటూ విలేకరులు ప్రశ్నించగా అందుకు ఈమె సమాధానం చెబుతూ.నేను కూడా ఎదురు చూస్తున్న ఈ కోరిక తొందరగా నెరవేరాలని దేవుని ప్రార్థిస్తున్నా అంటూ ఈ సందర్భంగా ఈమె టాలీవుడ్ ఎంట్రీ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని చిన్నప్పుడు తన తండ్రి సినిమా షూటింగ్లో చేసే సమయంలో మేము కూడా హైదరాబాద్లో సందడి చేసి తిరిగి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వెళ్లే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.