తెలుగులో టాలీవుడ్ ప్రముఖ యంగ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించినటువంటి భారీ బడ్జెట్ చిత్రం “సాహో” గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ నటించారు.
అయితే ఓ స్పెషల్ గీతంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించింది.ఈ పాట ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.
అయితే తాజాగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా తాను శ్రీలంక దేశానికి చెందిన సిటిజన్ అని చెప్పుకొచ్చింది.
అయితే తాను ప్రస్తుతం సినిమాల షూటింగుల నిమిత్తమై ముంబై నగరంలో నివాసం ఉంటున్నానని తెలిపారు.అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తుండంతో కొంత మేర తన తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
అంతేగాక తన తల్లిదండ్రులను చూడాలనిపించినప్పటికీ ప్రస్తుతం ఎటువంటి విమానయాన మరియు రవాణా వ్యవస్థ లేకపోవడంతో కొంతమేర బాధపడుతున్నట్లు తెలిపింది.అంతేగాక ఇలాంటి క్లిష్ట సమయంలో తన తల్లిదండ్రుల వద్ద ఉంటే కొంత ధైర్యంగా ఉంటుందని అభిప్రాయపడింది.
అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్బంధాలును పాటించి కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలని సూచించింది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు అటాక్ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ పనులను కొంతకాలం పాటు వాయిదా వేశారు.
.