తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “లోఫర్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “దిశా పటాని” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడంతో హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది.
కాగా ఈ మధ్య కాలంలో నటి దిశా పటాని తను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా ఫోటో షూట్లు, హాట్ హాట్ వీడియోలతో బాగా పాపులర్ అవుతోంది.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి దిశా పటాని తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోల వల్ల మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇందులో ఈ అమ్మడు బీచ్ లో టూ పీస్ బికినీ దుస్తులు ధరించి మితిమీరిన అందాల ఆరబోతతో కుర్ర కారుని కట్టి పడేసింది.దీంతో ఈ అమ్మడు హాట్ ఫోటోలకి నెటిజన్లు ఫిదా అయ్యారు.
అంతేగాక ఈ ఫోటోలను షేర్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపుగా 22 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.అలాగే దిశా పటాని బికిని దుస్తులు ధరించి నీళ్ళకు సైతం చెమటలు పట్టిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ అమ్మడి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రస్తుతం దాదాపుగా నాలుగు కోట్ల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దిశా పటాని కి సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అని.
ఈ విషయం ఇలా ఉండగా నటి దిశా పటాని ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి “రాధే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అయిన “జీ సినీ ప్లెక్స్” లో విడుదల చేశారు.అయినప్పటికీ ఈ చిత్రం దాదాపుగా “300 కోట్ల రూపాయలకు” పైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం.కాగా దిశా పటాని హిందీలో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “ఏక్ విలన్” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనుల్లో ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.