పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు దిశా పటానీ పరిచయ్యారు.లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా దిశా పటానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఆ సినిమా తరువాత దిశా పటానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు.ఇటీవల విడుదలైన రాధే సినిమాలో కూడా దిశా పటానీ నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా దిశా పటానీ కెరీర్ కు ప్లస్ కాలేదు.
రొటీన్ కథతో తెరకెక్కిన రాధే సినిమా దిశా పటానీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
రాధే సినిమాలో గ్లామర్ షోతో దిశా పటానీ రెచ్చిపోయారు.అయితే దిశా పటానీ ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.500 రూపాయలతో ముంబైలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం.దిశా పటానీ ఉత్తరాఖాండ్ కు చెందిన వారు.
కుటుంబం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం తీసుకోకుండా దిశా పటానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
సినిమాసినిమాకు మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరోయిన్ గా దిశా పటానీ సత్తా చాటారు.ఎంతో కష్టపడి అడిషన్స్ కు వెళ్లానని దిశా పటానీ వెల్లడించారు.మొదట కొన్ని టీవీ యాడ్స్ లో నటించిన దిశా పటానీకి ఊహించని విధంగా లోఫర్ సినిమాలో అవకాశం దక్కింది.
దిశా పటానీకి సొంతంగా ముంబైలో ఇల్లు ఉండగా ఆ ఇంటి ఖరీదు 5 కోట్ల రూపాయలు అని సమాచారం.ఆమె దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయని జాగ్వార్ ఎఫ్ ఫేస్, బీఎండబ్ల్యూ, మెర్సిడేస్ ఈ 220 కారు కూడా ఉందని ఈ కార్ల విలువ కోటిన్నర రూపాయలు అని సమాచారం.
దిశా పటానీ మొత్తం ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల మధ్యలో ఉండవచ్చని తెలుస్తోంది.