బాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ “అనన్య పాండే” వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.అయితే ఈ అమ్మడు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన అందం, నటన, అభినయంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కాగా అనన్య పాండే ఒకప్పటి ప్రముఖ స్టార్ హీరో చుంకీ పాండే కూతురు అయినప్పటికీ తన తండ్రి నుంచి నటన పరంగా ఎన్నో మెళుకువలు నేర్చుకొని ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో అనన్య పాండే సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
కాగా తాజాగా ఆ మధ్య అనన్య పాండే పితృ దినోత్సవ సందర్భంగా తన తండ్రితో చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.అంతే కాకుండా తన తండ్రి పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
దీంతో ఈ అమ్మడు తన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 10 మిలియన్ల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనన్య పాండే తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న “లైగర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగాతెలుగు ప్రముఖ హీరోయిన్ చార్మి కౌర్ మరియు బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.