తెలుగు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “చిరుత” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “నేహ శర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల ఎందుకో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.
దీనికితోడు చిరుత చిత్రం తర్వాత ఈ అమ్మడు “కుర్రాడు” అనే చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.దీంతో ఈ అమ్మడు మూటా ముల్లె సర్దుకుని తిరిగి ముంబైకి వెళ్లి పోయింది.
అక్కడ అడపాదడపా చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం దక్కించుకోలేక పోయింది.దీంతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది.
కాగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి సోదరి “అయేషా శర్మ” కూడా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు కోసం బాగానే ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించుకుంటుంది.
ఇందులో భాగంగా అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.కాగా తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అంతేకాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫిదా అయ్యారు.దీంతో లక్షలు సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
అంతే కాకుండా కొందరు నెటిజన్లు ఈ అమ్మడి ఫొటోలపై స్పందిస్తూ అయేషా శర్మ పరువు అందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య అయేషా శర్మ హిందీలో ప్రముఖ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన “సత్యమేవ జయతే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
కానీ ఈ చిత్రం ఫర్వాలేదనిపించినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ఎలాంటి సినీ అవకాశాలను తెచ్చి పెట్టలేకపోయింది.దీంతో ఇటీవల కాలంలో నేహా శర్మ తన సోదరి అయేషా శర్మ ని టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.