బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అప్పటి నుండి డ్రగ్స్ కేసులో ఎందరో బాలీవుడ్ నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
మొత్తానికి డ్రగ్స్ కలకలం బాలీవుడ్ ను తెగ ఊపేస్తుంది.
ఇకపోతే డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్ ను విచారించిన అధికారులు, అతను ఇచ్చిన సమాచారంతో మరో నటుడు గౌరవ్ దీక్షిత్ ఇంటిపై దాడి చేయగా, భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలు లభ్యమైన విషయం తెలిసిందే.
ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే గౌరవ్ దీక్షిత్, తన విదేశీ స్నేహితురాలితో అక్కడికి వచ్చాడని, ఎన్సీబీ టీమ్ ను చూసి, అక్కడి నుంచి అతను పారిపోయాడని ఓ అధికారి తెలిపారు.కాగా గౌరవ్ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత ఈ కేసు కీలక మలుపులు తీరుగుతుంది.కాగా ఈ డ్రగ్స్ జాబితాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అర్జున్ రామ్ పాల్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ వంటి చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.