బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఒక స్టార్ నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు.ఈయనంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అభిమానం.
టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అమితాబ్ బచ్చన్ ను బాగా గౌరవిస్తారు.కేవలం అమితాబ్ ఒక్కడే కాకుండా తన కుటుంబం కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈయన దాదాపు రెండు వేలమంది అప్పులను తీర్చాడు.
సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారు.
ఇప్పటికే చాలామంది నటులు ప్రజలకు పలు రకాలుగా సహాయాలు చేస్తున్నారు.కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి వెనుకాడరు.అందులో అమితాబ్ బచ్చన్ అయితే మొదటి స్థానంలోనే ఉంటాడు.సామాన్య ప్రజలకే కాకుండా మనకు కడుపు నింపే రైతులకు కూడా ఎంతో సహాయం చేసాడు అమితాబచ్చన్.
గత కొన్నేళ్ల నుండి రైతుల పరిస్థితి బాగా దిగజారిపోయింది.
ఎందరో రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి వ్యవసాయాన్ని పండించిన కూడా పెట్టుబడి పెట్టినంత లాభాలు అందుకోవడం లేదు.అలా ఎంతో మంది రైతులు తాము అనుకున్నంత లాభం రాకపోయేసరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇక కొందరు పెట్టుబడి కోసం పెట్టిన అప్పులను తీర్చుకోలేక వ్యవసాయం చేయడమే వదులుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అమితాబచ్చన్ ఎంతోమందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.ఇక గతంలో బీహార్ లో మాత్రం దాదాపు రెండు వేల మందికి అప్పులను తీర్చి వారి కంటనీరును తుడిచాడు.అంతేకాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద వారి అప్పులను మొత్తం తీర్చాడు.కొందరి అన్నదాతల అప్పులను వారి బ్యాంకు ఖాతాలో వేసి తీర్చాడు.మరికొందరి అన్నదాతల అప్పులను తమ ఇంటికి పిలిపించి చెక్కుల ద్వారా అందజేశాడు.ఈయనతో పాటు తన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా బచ్చన్ లు కూడా రైతులకు చెక్కులను అందించారు.
ఇప్పటికే ఎంతో మంది రైతులను ఆదుకున్న అమితాబచ్చన్ గతంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో వెయ్యి మంది రైతుల కష్టాలను తెలుసుకొని వారికి కూడా రుణమాఫీ చేశాడు.దాదాపు రూ.ఐదున్నర కోట్లతో వెయ్యి మంది రైతులకు రుణ మాఫీ చేసాడు.
ఇక రైతులతో పాటు మరికొంతమంది బాధితులకు కూడా సహాయం చేయడానికి వెనకాడలేదు అమితాబచ్చన్.గతంలో పుల్వామా ఉగ్రదాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఆ ఘటనలో ఎంతోమంది అమరులు మన దేశం కోసం ప్రాణాలు విడిచారు.
ఆ సమయంలో అమితాబచ్చన్ ఆ అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి కూడా తన వంతు సహాయం అందించాడు.అలా అమితాబచ్చన్ ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెనుకాడకుండా ముందు అడుగు వేస్తాడు.
ఇక ఈయనను స్ఫూర్తిగా తీసుకొని అలా ఎంతో మంది నటులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ నటులు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారు.కరోనా సమయంలో నటుడు సోనూసూద్ కూడా ఎంతోమంది బాధితులకు సహాయం చేసిన సంగతి తెలిసిందే.కేవలం రాజకీయ నాయకులే కాదు నటులు కూడా ప్రజలను పాలిస్తారని నిరూపించారు.