రేయ్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు సాయిధరమ్ తేజ్.2020 సంవత్సరంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం డైరెక్టర్ దేవాకట్టా డైరెక్షన్ లో రిపబ్లిక్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ ఏడాది జూన్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటన వెలువడింది.
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిపబ్లిక్ సినిమా విడుదలయ్యే రోజునే బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ సినిమా కూడా విడుదల కానుంది.రణవీర్ నటిస్తున్న 83 మూవీపై భారీగా అంచనాలు నెలకొనగా క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.83 రిలీజ్ రోజునే రిపబ్లిక్ సినిమా విడుదలైతే మాత్రం రిపబ్లిక్ కలెక్షన్లపై ప్రభావం పడుతుంది.
ఈ సినిమా తెలుగులోకి డబ్ కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.కపిల్ దేవ్ బయోపిక్ కావడంతో క్రికెట్ లవర్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.రణవీర్ సినిమా విడుదలైతే రిపబ్లిక్ మూవీ కంటే 83 మూవీని ప్రదర్శించడానికే మల్టీపెక్స్ లు ఆసక్తి చూపుతాయి.
హైదరాబాద్, వైజాగ్ లలో 83 సినిమాను ప్రదర్శించడానికే ఎక్కువమంది థియేటర్ యజమానులు ఆసక్తి చూపుతారు.
ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు మే 28వ తేదీన బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కనున్న బీబీ3 సినిమా విడుదల కానుంది.సాయితేజ్ రిలీజ్ డేట్ ను మార్చుకుంటే మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.