జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి భోగ శ్రావణి రాజీనామా.స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విభేదాలు కారణం అంటూ ప్రకటన.
చైర్ పర్సన్ పదవికి శ్రావణి రాజీనామాతో బయటపడ్డ అధికార బిఆర్ఎస్ పార్టీలో విభేదాలు.మీడియా సమావేశం పెట్టి తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్ కు అందజేసిన శ్రావణి.
భోగ శ్రావణి కామెంట్స్: ఒక బిసి మహిళా ఎదుగుతుందన్న ఉద్దేశ్యం తో ప్రతి తప్పుకు నన్ను బాధ్యులను చేశారు.అభివృద్ది పనులు అన్ని ఎమ్మేల్యే ఖాతా లో వేసుకున్నారు.
కనీసం ఒక పదివేల డస్ట్ బిన్ కు కూడా కొబ్బరి కాయ కొట్టుకునే పరిస్థితి లేదు.
అవిశ్వాసం పేరు తో కొత్త డ్రామా మొదలు పెట్టారు.సంతకాలు చేయకపోతే కౌన్సిలర్ల కు బెదిరింపులు.మీకు కుటుంభం ఉంది జాగ్రత్త అని ఎమ్మెల్యే అని హెచ్చరించాడు.
నా గొంతు తో నేను మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు…ఎమ్మెల్యే రాసిన స్క్రిప్ట్ చదవాలి.ముళ్ల కిరీటం తలపై పేట్టి మూడేళ్లుగా మానసిక వేధింపులతో.
ఎన్నో అవమానాలు భరించాను.మీ చైర్ పర్సన్ పదవి చేస్తున్నా.మీరే గెలిచారు దోర.బిసి బిడ్డలు, మహిళలు ఉన్నత పదవులకు పనికి రారు.మా కుటుంబానికి ఎస్పి గారు రక్షణ కల్పించాలి.