నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి ,కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలలో పూర్వజన్మ ప్రేమకథ చిత్రం ద్వారా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కి గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటన డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇందులో సాయిపల్లవి దేవదాసీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇలా సాయిపల్లవి పాత్రకు ఎంతో మంది చేత ప్రశంసలు అందగా తమిళనాట మాత్రం ఈమెకు ఘోర అవమానం జరిగింది.
ఈ సినిమాలో సాయి పల్లవి బాగా లేదంటూ ఆమె బాడీ షేమింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.అయితే చాలామంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజాగా ఇదే విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ సాయి పల్లవి బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం తనకు ఎంతో బాధ కలిగించాయని ఈమె తెలియజేశారు.అయినా ఒక వ్యక్తి బాడీ షేమింగ్ గురించి అలా మాట్లాడటం వల్ల అవతలివారు ఎలా బాధ పడతారో ఆ బాధ తనకు తెలుసని ఈ సందర్భంగా తమిళి సై తెలియజేశారు.
మొదట్లో తాను కూడా ఈ విధమైనటువంటి బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని ఎంతోమంది తనని కూడా ఇలా బాధ పెట్టారని ఆమె తాను ఎదుర్కొన్న అనుభవం గురించి తెలియజేశారు.అలాంటి వాటి బారిన పడకుండా ఉండటానికి మనమేమి మహాత్ములం కాము.కానీ వాటి గురించి నేను పట్టించుకోలేదు అయినా అలాంటివి మనకు బాధ కలిగిస్తాయా అంటే తప్పకుండా కలిగిస్తాయని ఈ సందర్భంగా ఈమె బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు.