మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకుంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అయ్యాడు.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్స్ను కథలు వినిపించాల్సిందిగా చిరు సూచించడంతో దర్శకుడు బాబీ చిరు కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశాడు.లాక్డౌన్ సమయంలో చిరు కోసం బాబీ ఓ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
గతేడాది ‘వెంకీ మామ’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు చిరు కోసం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ కథను రెడీ చేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా మరో యంగ్ డైరక్టర్ సుజీత్తో కలిసి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అయ్యాడు.
ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూ్స్ చేసేందుక రెడీ అయ్యాడు.మరి బాబీతో చిరు ఎలాంటి సినిమాను తీస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
త్వరలోనే చిరుకు కథను వినిపించేందుకు బాబీ రెడీ అవుతున్నాడట.