మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రంగా ‘ఆచార్య’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో చిరు సోషల్ మెసేజ్ను అందిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమాలను కూడా చిరు లైన్లో పెట్టాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా డైరెక్టర్ బాబీ కూడా మెగాస్టార్కు ఓ అదిరిపోయే సబ్జెక్ట్ వినిపించినట్లు తెలుస్తోంది.
ఈ కథను పక్కా మాస్ ఎంటర్టైనర్గా బాబీ రాసుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల వెంకీ మామ లాంటి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించేందుకు బాబీ రెడీ అవుతున్నాడట.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే బాబీతో చిరు సినిమా త్వరలోనే కన్ఫం అయ్యే అవకాశం ఉందని చిత్ర వర్గాల టాక్.మరి బాబీకి చిరు ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.