టీటీడీ కీలక నిర్ణయం..!!

టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.గతంలో వయోపరిమితి పేరుతో రిటైరైన అర్చకులను మరియు ప్రధాన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

 Ttd Board Sensational Decision On Retired Priests ,  Ramana Dikshuthulu, High Co-TeluguStop.com

వయోపరిమితి పేరుతో రిటైర్ అయిన అర్చకులు తిరిగి విధుల్లోకి రావాలని 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.తిరుమల తిరుపతి దేవస్థానం తాజా ఆదేశాలతో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరనున్నారు.

దీంతో ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వారి విషయంలో సందిగ్ధత నెలకొంది.వాళ్లు ప్రధాన అర్చకులుగా కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.శ్రీవారి ఆలయానికి సంబంధించి 2018 మే మాసంలో.అప్పటి పాలక మండలి ఆలయ అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమల్లోకి తీసుకు రావడం జరిగింది.

దీంతో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది అంటూ తెలపడంతో అప్పటి ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు మరియు కొంతమంది అర్చకులు రిటైర్ అయ్యారు.అయితే ఇప్పుడు టిటిడి తీసుకున్న తాజా నిర్ణయంతో వీళ్లంతా తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube