దేశంలో రానురాను హత్యాచారాల శాతం ఎక్కువై పోతోంది.ముక్కు పచ్చలారని చిన్న పిల్ల నుంచీ ముసలి వయసు వచ్చిన మహిళలపై కూడా హత్యచారాలు పెరిగిపోతున్నాయి.15 ఏళ్ల బాలురు కూడా హత్యచారాలకి పాల్పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.ఎన్ని ఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఎవరికీ కూడా సరైన శిక్షలు పడక పోవడంతో ఎవరికీ వారు బరితెగించి పోతున్నారు.
గత వారం రోజుల్లో జరిగిన సంఘటనలే ఇందుకు సాక్ష్యం.మొన్న ఎనిమిదేళ్ళ పాప హత్యచార ఘటనలో దేశం అట్టుడికి పోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం మరువక ముందే మరొక సంఘటన దేశాన్ని కుదిపేస్తోంది.
ఆరు నెలల చిన్న పసిగుడ్డుపై జరిగిన హత్యాచార సంఘటన ఇప్పుడు దేసవ్యప్తంగా సంచలనం సృష్టిస్తోంది.వివరాలలోకి వెళ్తే.
మధ్యప్రదేశ్లో తల్లి పక్కనే నిద్రిస్తున్న ఆరు నెలల పసికందును ఎత్తుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆ పసి గుడ్డుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అక్కడితో ఆగకుండా ఆచిన్నారిని చంపేశాడు ఈ సంఘటన ఇండోర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఇండోర్ నగరంలోని రాజ్వాడా ఫోర్ట్ సమీపంలో గల ఓ భవనం బేస్మెంట్లో రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు అయితే విచారణ చేపట్టిన పోలీసులు బేస్మెంట్లో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించారు.
సీసీటీవీ పరిశీలనలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి సదరు చిన్నారిని భుజాన ఎత్తుకొని బేస్మెంట్కు తీసుకొచ్చినట్లు కనిపించింది దాంతో విచారణ మరింతగా చేసిన పోలీసులు వివరాలు సేకరించారు రాజ్వాడా ఫోర్ట్ సమీపంలో ఓ కుటుంబం బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
వారికి ఆరు నెలల కుమార్తె ఉంది.గురువారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా సునిల్ భీల్ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు.
అయితే అక్కడ సమీపంలోని ఓ భవనం బేస్మెంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.అనంతరం ఆచిన్నారిని నేలకేసి కొట్టి మరీ చంపేశాడు.
బేస్మెంట్లో దుకాణం తెరవడానికి వచ్చిన ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి భయపడి పోలీసులకు సమాచారమిచ్చాడు.దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.