సజహంగా బీపీ అనేది 40 ఏళ్ళు పైబడిన వారిలో కలుగుతుంది.ప్రస్తుత ఆహారపు అలవాట్లు, లేదా దైనందిన కార్యక్ర్యమాల వలన కూడా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
అయితే చాలా మంది పిల్లల్లో 10 ఏళ్ళు నిండగానే బీపీ ముంచుకొస్తోందని ఓ అధ్యయనంలో తేలింది.ఈ క్రమంలోనే అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ రకమైన మార్పులపై అధ్యయనం చేపట్టారు.
పిల్లల్లో బీపీ రావడానికి ప్రధాన కారణం విటమిన్ –డి లోపమే అని గుర్తించారు.చిన్న వయసులోనే సిస్టోలిక్ బీపీ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇతరులతో పోల్చితే డి-విటమిన్ లోపం ఉన్న చిన్నారులు 6 నుంచీ 18 సంవత్సరాల వయస్సు మధ్య అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కునే ప్రమాదం 60 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించారు.
పిల్లలో బీపీ వలన త్వరగా గుండె సంభదిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉదృతం అవుతాయని, అదే గనుకా జరిగితే పిల్లలు తమ జీవితాలని త్వరలోనే ముగించే దుస్థితి వస్తుందని, జీవితాంతం ఔషధాలతో బ్రతకాల్సిందేనని తెలిపారు.ఈ పరిస్థితులు తెలెత్తకుండా పిల్లలు కానీ పెద్దలు కాని సూర్య రశ్మిలో అధికంగా లభించే విటమిన్ –డి ని పొందాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు