తెలుగు సినీ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కరాటే కళ్యాణి తాజాగా యూట్యూబ్ శ్రీకాంత్ పై దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ ఘటనతో మరొకసారి వార్తల్లో నిలిచింది కరాటే కళ్యాణి.
ఫ్రాంక్ వీడియోలు పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారితో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ అతని పై దాడికి దిగిన విషయం తేలిసిందే.తాజాగా గురువారం రాత్రి శ్రీకాంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్ళిన కళ్యాణి తన అనుచరులతో కలసి శ్రీకాంత్ పై దాడికి దిగింది.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డితోపాటు కరాటే కళ్యాణి కూడా గాయాలు కావడంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరొక వ్యక్తి కరాటే కళ్యాణి బాధితుల్లో మేము కూడా ఉన్నాం అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
గోపి కృష్ణ అనే ఒక బాధితుడు గతంలో తన ఇంటి విషయంలో కరాటే కళ్యాణి తనను బెదిరించి 3.5 లక్షలు వసూలు చేసిందని ఆరోపించారు.అయితే డబ్బులు అంత చెల్లించిన తర్వాత అదనంగా డబ్బులు ఇవ్వాలి అని బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు పురుగుల మందు తాగిన వీడియోని పంపి వారిని మరింత భయభ్రాంతులకు గురి చేసింది అని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు.దీనితో తాము ఎలా అయినా న్యాయం చేయాలి అని హైదరాబాద్ సిపి కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసాడు బాధితుడు.
అయితే ఇప్పటికే యూట్యూబ్ శ్రీకాంత్ విషయంలో సతమతమవుతున్న కరాటే కళ్యాణి కి కొత్తగా ఈ ఇంటి వ్యవహారం వచ్చి పడింది.అసలు ఆ ఇంటి వ్యవహారం ఏంది? గోపి కృష్ణ అనే బాధితుడికి కళ్యాణికి సంబంధం ఏమిటి అన్న విషయాలు తెలియాల్సి ఉంది.ఇకపోతే కరాటే కళ్యాణిపై తీవ్ర ఆరోపణలు చేసి, ఆమె చేతిలో దెబ్బలు తిన్న యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి. ఆమె లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని.చివరికి మధ్యవర్తి ద్వారా 70 వేలు అయినా ఇవ్వలంటూ ఒత్తిడి చేసిందని ఆ డబ్బులు ఇవ్వకపోయే సరికి తనపై దాడి చేసిందని అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.