ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు కరోనా పాజిటివ్ కొత్త కేసులు రోజుకి దాదాపు పాతిక వేలకు పైగానే నమోదయ్యే పరిస్థితి.ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించి వైరస్ ను అదుపులోకి తీసుకు వస్తూ ఉన్నారు.
దీంతో ప్రస్తుతం ఏపీలో రోజుకి కొత్త పాజిటివ్ కేసులు 13 వేలకు చేరాయి.కర్ఫ్యూ విధించడం వల్ల సత్ఫలితాలు వస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా జూన్ 10 వరకు ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించడం జరిగింది.
అయితే కరోనా కంట్రోల్ అవుతున్ కానీ ఇప్పుడు ఏపీకి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి.
అదేమిటంటే కరోనా బారిన పడుతున్న వారికి మాత్రమే కాక కొత్త వారికి బ్లాక్ ఫంగస్ రావటం అర్థం కాని విషయంగా మారింది.
ఏపీలో కృష్ణాజిల్లాలో భయంకరంగా ఈ ఫంగస్ కేసులు బయటపడుతున్న పరిస్థితి.రాష్ట్రంలో 1139 మంది కరోనా నుండి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ బారిన పడటం జరిగింది.అయితే 40 మందికి కరోనా సోకాకపోయినా గాని బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గుర్తించడం జరిగింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తం అవుతూ అరికట్టడానికి ప్రత్యేక వైద్య బృందాలు రంగంలోకి దింపటం జరిగింది.
కాగా కరోనా వచ్చిన వారికి బ్లాక్ ఫంగస్ రావడం కామన్ గాని దానికి భిన్నంగా ఏపీలో పరిస్థితి ఉండటం ప్రభుత్వానికి టెన్షన్ పుట్టిస్తోంది.