పులి తర్వాత ఎలుగు దాడి ;విద్యార్ధి మృతి

మొన్నీ మధ్య ఢిల్లీ జూ లో పులి భారిన పడి ఒక యువకుడు మరణించిన సంగతి తెలిసిందే .ఇప్పుడు అలాంటి సంఘటనే మళ్ళీ చోటు చేసుకుంది .

 Black Bear Attack Kills College Student In New Jersey-TeluguStop.com

అయితే ఈ సరి జరిగింది అమెరికా లో కాకపొతే అక్కడ కూడా మరణించింది మన భారత విద్యార్దే

న్యూజెర్సీలో ఎలుగు దాడిలో ఓ భారతీయ సంతతి కి చెందిన విద్యార్థి మరణించాడు.గుజరాత్ కు చెందిన దర్శ్ పటేల్ అనే యువకుడిగా ఇతడ్ని గుర్తించారు.

న్యూ జెర్సీ యూనివర్సిటీ లో చదువుతున్న పటేల్ ఇటీవల మరో నలుగురు విద్యార్థులతో కలిసి అపాష్వా వన్యమృగ సంరక్షణ కేంద్రానికి పిక్నిక్ కి వెళ్ళాడు.

తన స్నేహితులతో కలిసి జూ లో తిరుగుతుండగా ఒక ఎలుగు బంటి వీరిని వెంబడించింది .భయం తో పరుగులు పెట్టిన ఆ నలుగురు స్నేహితులు తలా ఒక దారిన వెళ్ళిపోయారు .

అయితే ఆ తర్వాత దర్శ్ పటేల్ కనిపించక పోవడం తో వారు అక్కడ అధికారులకు ఫిర్యాదు చేశారు .రెండు గంటల సేపు దర్శ్ కోసం వెతికిన పోలీస్ లకు అతను గాయాలపాలయి చనిపోయి ఉండడం కనిపించింది .ఆ ప్రక్కనే ఎలుగు బంటి ఉండడం తో ఎలుగు దాడిలోనే దర్శ్ మరణించినట్టు పోలీస్ లు ద్రువీకరించారు

విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఎలుగును తుపాకితో కాల్చి చంపారు.ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే తొలిసారని ,ఈ ఎలుగు దాడి అసాధారణమని అధికారులు అంటున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న పటేల్ మృతితో గుజరాత్ లోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube