కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధి కుమారుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేసిన మరో ఆరోపణ ఇది.రాహుల్ బ్రిటిష్ సిటిజెన్ అని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని స్వామి ఆరోపణలు ఇంకా సంచలనం కలిగిస్తూ ఉండగానే, ఆ వేడి చల్లారక ముందే కొత్త ఆరోపణ చేశారు.
రాహుల్ ఒక్కడి మీదనే కాకుండా, సోనియా మీద కూడా సరి కొత్త ఆరోపణ చేశారు.బ్రిటన్లోని రాహుల్ కంపెనీ వేరే ఏ కంపెనీతో కలిసి వ్యవహారాలూ నడిపిందో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ఆరా తీయాలని కోరారు.
రాహుల్ కమీషన్ ఏజెంట్ అనే సంగతి తనకు బాగా తెలుసని స్వామి చెప్పారు.ఆయన ఎటువంటి సమాచారం లేకుండా రెండున్నర నెలలు దేశం విడిచి వెళ్ళాడు.
ఆయన ఎక్కడికి వెళ్ళాడో సమాచారం కూడా లేదు.ఈయన ఎటువంటి రాజకీయ నాయకుడు? అని స్వామి ప్రశ్నించారు.రాహుల్ పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకు ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ఎంపీగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంది బ్రిటన్లో కంపెనీ పెట్టాలని అనుకున్నాడు.
దీనిపై ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ తప్పని సరిగా దర్యాప్తు చేయాలి అని కోరారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జ్యూరిచ్ లోని ఒక బ్యాంకులో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపించారు.
జ్యూరిచ్లోని సరసిన్ బ్యాంకులో ఈ డబ్బు ఉందని స్వామి చెప్పారు.ఈయన చేసినవి చాలా తీవ్ర ఆరోపణలు.ఇందుకు ఆధారాలు ఉన్నాయా? ఉంటే మాత్రం ఆరా తీయాల్సిందే.