అయోధ్య రామాలయ నిధి సేకరణపేరుతో బీజేపీ వేసిన వ్యూహం ఇదే?

టీఆర్ఎస్ కు ధీటుగా మాటల తూటాలు పేలుస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారడానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది.ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఎంతగా ప్రచారం చేసిన లాభం లేకపోవడం, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం లేకపోవడంతో బీజేపీ గత కొన్నేళ్లుగా సత్తా చాటుకోలేకపోయింది.

 Is This The Bjp's Strategy In The Name Of Ayodhya Ramalaya Fundraising?,bjp, Ba-TeluguStop.com

ఇప్పుడిప్పుడే క్షేత్ర స్థాయి కార్యకర్తల నిర్మాణంపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు కార్యకర్తల స్థాయిని మరింత బలపరుచుకోవడానికి ఒక బలమైన అస్త్రాన్ని ఎంచుకొంది.అయోధ్య రామాలయ నిర్మాణ నిధి సేకరణ పేరుతో ఇంటింటి ప్రచారం చేపడుతున్న రామాలయ నిర్మాణ సంఘం అనుబంధ సభ్యులు వారితో పాటు బీజేపీ నాయకులు వారితో పాటు నిధి సేకరణలో పాల్గొంటున్నారు.

పనిలో పనిగా బీజేపీ నినాదంతో బలమైన రాజకీయ పునాదులు వేసేలా ఈ వ్యూహాన్ని ఎంచుకుంది బీజేపీ.ఇక వ్యూహంతో చాప క్రింద నీరులా బీజేపీ క్షేత్ర స్థాయి నిర్మాణం చేస్తూ ఇక టీఆర్ఎస్ ధీటుగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది.

అంతేకాక కార్యకర్తల సభ్యత్వ నమోదు చేపడుతుండడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తల బలం పెంచుకుంటూ కార్యకర్తలకు ఉత్తేజం కలిగించే ప్రయత్నం గట్టిగా చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube