మునుగోడు ఉప ఎన్నికపై బిజెపి కీలక సమావేశం నిర్వహించింది.తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ జాతీయ కార్యవర్గ సభ్యులతో హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, విజయశాంతి, ఈటెల, వివేక్, గరికపాటి తదితరులు పాల్గొన్నారు.బిజెపి చీఫ్ బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బిజెపి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది.దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలని మునుగోడు లో కూడా తిరగరాయాలని యోచనలో ఉంది.
ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు కార్యకర్తలకు సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేయనున్నారు.