తెలంగాణ రాజకీయాలలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణలో ఏమాత్రం పట్టు కలిగి లేని బీజేపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా బండి సంజయ్ నియామకం తరువాత బీజేపీ ఒక్కసారిగా పుంజుకున్న విషయం తెలిసిందే.
అయితే బీజేపీని కూడా మొదట లైట్ తీసుకున్న కెసీఆర్ దుబ్బాక ఎన్నిక విజయంతో ఒక్కసారిగా ఖంగు తిని ఆచితూచి అడుగులేసిన పరిస్థితులను మనం చూశాం.ఇక దుబ్బాక ఎన్నిక విజయంతో బీజేపీ టీఆర్ఎస్ పై దూకుడును మరింత పెంచింది.
కెసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ క్షేత్ర స్థాయిలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తూ టీఆర్ఎస్ పై దండయాత్ర చేస్తోంది బీజేపీ.అయితే బీజేపీ టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున దండయాత్ర చేయడంలో ఉన్న అసలు వ్యూహం ఏంటని ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనేది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా లేదు.
అంతేకాక కెసీఆర్ పదునైన విమర్శలతోనే విపక్షాలను ఇరుకున పెట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తాడు కాబట్టి బీజేపీ కూడా కెసీఆర్ పై అదే వ్యూహాన్ని ఎంకుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అందుకే సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కొంటూ ప్రజలలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ దూసుకుపోతోంది బీజేపీ.