మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది.

 Bjp's Focus On Munugodu By-election-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.దీనిలో భాగంగా ఈనెల 7 నుంచి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని టచ్ చేసేలా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు.

అదేరోజున బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టాలనే యోచనలో ఉంది.ఈనెల 10 బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ కీలక సమావేశం కానున్నారు.

అదేవిధంగా మునుగోడులో నకిలీ ఓట్లపై దృష్టి సారించిన కాషాయదళం.ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని సమాచారం.

కాగా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారు.మరోవైపు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు బ్రేక్ పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube