పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి, కాని..!

నందమూరి తారక రామారావు రాజకీయ వారసురాలిగా కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యి కేంద్రమంత్రిగా కూడా పని చేసిన పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న విషయం తెల్సిందే.మొదటి సారి మోడీ ప్రధాని అయిన సమయంలోనే బీజేపీ నాయకురాలిగా పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కాల్సి ఉంది.

 Bjpplanto Give Thecentralminister To Purandeswari-TeluguStop.com

కాని ఆ సమయంలో పురందేశ్వరికి మొండి చేయే ఇచ్చారు.ఇక మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పురందేశ్వరి గెలిచి ఉంటే ఖచ్చితంగా ఆమెకు మంత్రి పదవి వచ్చేదని చాలా మంది అంటున్నారు.

త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉన్న కారణంగా ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.రాజ్యసభ సభ్యత్వంతో ఆమెను మంత్రిగా చేయాలనేది బీజేపీ నాయకత్వం చేస్తున్న ఆలోచన.

అయితే ప్రస్తుతం ఆమె భర్త మరియు కొడుకు వైకాపాలో కొనసాగుతున్నారు.వారు బీజేపీలో జాయిన్‌ అయితే అప్పుడు పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట.

ఇప్పటికే వైకాపాకు రాజీనామా చేసే యోచనలో ఉన్న దగ్గుబాటి త్వరలోనే రాజీనామా చేయడం పురందేశ్వరికి మంత్రి పదవి దక్కడం కన్ఫర్మ్‌గా అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube