మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత గోపాల్ భార్గవ కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్ లోని జబువా లో ఉపఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఈ ఉపఎన్నికలు రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి కావని,ఇండియా పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
భారత్ తరపున బీజేపీ పార్టీ పోటీ చేస్తుండగా,పాకిస్థాన్ తరపున కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం.బీజేపీ నేతలు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమి కొత్తేమీ కాదు.
గతంలో కూడా పలువురు బీజేపీ నేతలు పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.అయితే ఈ సారి గోపాల్ భార్గవ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎలా స్వీకరిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఉపఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ పై ఇలా సంచలన వ్యాఖ్యలు చేసి బీజేపీ పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది.మరోపక్క పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి భారత మాజీ ప్రధాని,కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం లభించింది.
సిక్కుల కల అయిన కర్తార్ పూర్ కారిడార్ అందుబాటులోకి రానున్నది.ఈ క్రమంలో నవంబర్ 9 న ఈ కారిడార్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పాక్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది.ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖురేషి ఓ వీడియో సందేశం విడుదల చేశారు.త్వరలోనే అధికారికంగా మన్మోహన్ను ఆహ్వానిస్తామని వెల్లడించారు.ఇలాంటి సమయంలో బీజేపీ నేత గోపాల్ భార్గవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.