బీజేపీ మహిళ ఎంపీలు రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేశారు.రాహుల్ గాంధీ రేపిన్ ఇండియా అంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీలు తప్పుబట్టారు.
దేశంలో జరుగుతున్న రేప్ సంఘటనలు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, జార్ఖండ్ ఎన్నికల సమయంలో ఆయన రేపిన్ ఇండియా అంటూ దేశంలోని మనుషులు అంతా కూడా రేపిస్టులు అంటూ అర్థం వచ్చేలా మాట్లాడాడు అంటూ మహిళ బీజేపీ ఎంపీలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగిది.
దేశంలో రాజకీయ నాయకుడు రేప్ల గురించి మాట్లాడటం ఇదే ప్రథమం అని, రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ ఇలా మాట్లాడటం నేరంగా పరిగణించాలంటూ ఈసీకి ఎంపీలు ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్బంగా వారు ఈసీని కోరడం జరిగింది.ఎంపీల ఫిర్యాదును స్వీకరించిన ఈసీ ముఖ్య అధికారులు త్వరలోనే విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.