తెలంగాణ రాజకీయాలు రోజుకో ఆసక్తికర పరిణామంతో ఒక్కసారిగా హాట్ హాట్ గా పరిస్థితులు మారిపోతున్నాయి.అయితే తెలంగాణలో టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ టీఆర్ఎస్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా మొదటి నుండి పనిచేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇదే వ్యూహం వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి దోహదపడిన పరిస్థితిలో ఇదే వ్యూహాన్ని బలంగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించి మరింత విస్తృతంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రచారం వలలో కొందరు టీఆర్ఎస్ నేతలు పడ్డారని సమయాన్ని బట్టి వాళ్ళు బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం ఒకే రోజు ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ కోటలకి బీటలు వారినట్టేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది.
అంతేకాక ఇప్పుడు చాలా వరకు టీఆర్ఎస్ వ్యతిరేక వ్యక్తులలో యువతను ఎక్కువగా చేర్చేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న క్రమంలో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు చాలా కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం వందకు వంద శాతం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇక వచ్చే ఎన్నికల్లో ఎంత గొప్ప హామీ ఇచ్చినా మాటలపై విశ్వాసం కోల్పోతే ఇక ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది.అయితే కెసీఆర్ ఎటువంటి పరిస్థితినైనా తనకు అనుగుణంగా మార్చుకోగల సత్తా ఉంది.
కావున బీజేపీ నేతలు సైతం చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉంది.మరి బీజేపీ చాలా క్లారిటీగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇక రానున్న టీఆర్ఎస్ కోటరీకి బీటలు వారుతాయని బీజేపీ నేతలు బలంగా చెబుతున్న పరిస్థితి ఉంది.